ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా...
ఆడపడుచులు వ్రతము చూడగా
జోడు జోడుగా పరుగులిడగా
వేడుకొనుచూ ఆగినాము
మేడక్రిందనే నిలిచినామూ
హంసతూలిక తల్పమొదలి
హర్షమంతయూ ఆత్మ నిలిపి
పంచభానుని మరచి పొమ్మా
పంచగమనా నిదుర లెమ్మా
వ్యధలనన్నియు మంట గలిపి
మధుర నాధుని భజన సలిపి
వ్రతమునందలి పరణు పొంది
చతుర్విధముల ఫలితమొంది
అశ్వరూపులైన అసురులందరిని
మల్లులందరి చీల్చి చంపిన
దేవి దేవతలంత పొగడిన
ఆది దేవును ఆశ్రయించగా
మంద గమనా నిదురలెమ్మా
కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon